Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైమండ్ ప్రిన్సెస్‌లో నౌకలో ఉన్న భారతీయులు అంతేనా.. కేంద్ర మంత్రి ఏమన్నారు?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:34 IST)
జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్‌లో ఉన్న పర్యాటకుల్లో కరోనా వైరస్ బారినపడివారిలో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నౌకను జపాన్ ప్రభుత్వం నిర్భంధంలో ఉంచింది. అయితే, ఈ నౌకలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే అవకాశంలేదని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
 
కొవిడ్ -19 వైరస్ సోకిన నేపథ్యంలో జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్‌ను టోక్యో తీరంలోని యోకహామా వద్ద సముద్రంలోనే జపాన్ ప్రభుత్వం నిర్బంధించింది. ఈ నౌకలో 3,711 మంది ఉండగా, వీరిలో 138 మంది భారతీయులు ఉన్నారు. డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులకు కొవిడ్ -19 వైరస్ సోకిందని, వారికి నౌకలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. 
 
అయితే, కొవిడ్-19 వైరస్ నివారించేందుకు జపాన్ దేశం విహారనౌకలో 138 మంది భారతీయులను నిర్బంధించినందున వారిని బయటకు తీసుకురాలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే, నౌకలోని భారతీయుల గురించి తమ రాయబార కార్యాలయం జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర మంత్రులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments