డైమండ్ ప్రిన్సెస్‌లో నౌకలో ఉన్న భారతీయులు అంతేనా.. కేంద్ర మంత్రి ఏమన్నారు?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:34 IST)
జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్‌లో ఉన్న పర్యాటకుల్లో కరోనా వైరస్ బారినపడివారిలో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నౌకను జపాన్ ప్రభుత్వం నిర్భంధంలో ఉంచింది. అయితే, ఈ నౌకలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే అవకాశంలేదని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
 
కొవిడ్ -19 వైరస్ సోకిన నేపథ్యంలో జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్‌ను టోక్యో తీరంలోని యోకహామా వద్ద సముద్రంలోనే జపాన్ ప్రభుత్వం నిర్బంధించింది. ఈ నౌకలో 3,711 మంది ఉండగా, వీరిలో 138 మంది భారతీయులు ఉన్నారు. డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులకు కొవిడ్ -19 వైరస్ సోకిందని, వారికి నౌకలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. 
 
అయితే, కొవిడ్-19 వైరస్ నివారించేందుకు జపాన్ దేశం విహారనౌకలో 138 మంది భారతీయులను నిర్బంధించినందున వారిని బయటకు తీసుకురాలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే, నౌకలోని భారతీయుల గురించి తమ రాయబార కార్యాలయం జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర మంత్రులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments