Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు వెళుతున్నానని చెప్పి ఫ్రెండ్‌తో వెళ్లింది... గదిలో బంధించి గ్యాంగ్ రేప్

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (08:33 IST)
యువతీ యువకుల మధ్య ఏర్పడే ఫేస్‌బుక్ పరిచయం ఎన్నో అనర్థాలకు దారితీస్తోంది. తాజాగా ఫేస్‌బుక్ ఫ్రెండ్ చేతిలో ఓ బాలిక మోసపోయింది. ట్యూషన్‌కు వెళుతున్నానని తల్లిదండ్రులకు అబద్దం చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్, దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికకు ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. దీంతో గత యేడాది కాలంగా అతనితో చాటింగ్ చేస్తూ వస్తోంది. ఆ స్నేహంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. 
 
ఈ క్రమంలో ట్యూషన్‌కు వెళుతున్నానని తల్లిదండ్రులకు అబద్దం చెప్పిన ఈ బాలిక.. తన ఫేస్‌బుక్ స్నేహితుడుని కలిసింది. యువకుడు బాలికను లాంగ్ డ్రైవ్‌ పేరుతో మీరట్ తీసుకువెళ్లి అక్కడి హోటల్ గదిలో ఉంచాడు. అనంతరం తన స్నేహితుడులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
హోటల్ గదిలో యువకుల బారి నుంచి బయటపడిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం