Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీకి చిక్కిన నల్ల తిమింగలం.. రూ.120కోట్లు, 430 కేజీల బంగారం వెలికితీత

నోట్ల రద్దుతో నల్లధనాన్ని కొత్త నోట్లుగా మార్చేసిన నల్లకుబేరుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు ఇటీవలే భారీ మొత్తంతో పట్టుబడిన నేపథ్యంలో తాజాగా ఐటీ వలలో అతిపెద్ద అవినీతి తిమింగలం

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (13:40 IST)
నోట్ల రద్దుతో నల్లధనాన్ని కొత్త నోట్లుగా మార్చేసిన నల్లకుబేరుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు ఇటీవలే భారీ మొత్తంతో పట్టుబడిన నేపథ్యంలో తాజాగా ఐటీ వలలో అతిపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా జరుగుతున్న ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడుతోంది.

తాజాగా ఢిల్లీ నోయిడా శ్రీ లాల్ మహల్ కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన యజమానుల కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ లక్నో విభాగం ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా భారీ నగదు బయటపడింది. ఏకంగా ఐటీ దాడుల్లో రూ.120కోట్ల విలువైన 430కేజీల బంగారంతో పాటు రూ.2.48 కోట్ల పాత నోట్లు, రూ.12లక్షల కొత్త నోట్లు, 80కేజీల వెండి, 15కేజీల బంగారు ఆభరణాలను అధికారులు వెలికితీశారు.

ప్రత్యేక ఆర్థిక నిబంధనల ప్రకారం డ్యూటీ ఫ్రీ పద్దతిలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని అక్రమంగా కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తానికి లెక్క చెప్పలేకపోవడంతో ఐటీ అధికారులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ  కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments