Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీకి చిక్కిన నల్ల తిమింగలం.. రూ.120కోట్లు, 430 కేజీల బంగారం వెలికితీత

నోట్ల రద్దుతో నల్లధనాన్ని కొత్త నోట్లుగా మార్చేసిన నల్లకుబేరుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు ఇటీవలే భారీ మొత్తంతో పట్టుబడిన నేపథ్యంలో తాజాగా ఐటీ వలలో అతిపెద్ద అవినీతి తిమింగలం

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (13:40 IST)
నోట్ల రద్దుతో నల్లధనాన్ని కొత్త నోట్లుగా మార్చేసిన నల్లకుబేరుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు ఇటీవలే భారీ మొత్తంతో పట్టుబడిన నేపథ్యంలో తాజాగా ఐటీ వలలో అతిపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా జరుగుతున్న ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడుతోంది.

తాజాగా ఢిల్లీ నోయిడా శ్రీ లాల్ మహల్ కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన యజమానుల కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ లక్నో విభాగం ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా భారీ నగదు బయటపడింది. ఏకంగా ఐటీ దాడుల్లో రూ.120కోట్ల విలువైన 430కేజీల బంగారంతో పాటు రూ.2.48 కోట్ల పాత నోట్లు, రూ.12లక్షల కొత్త నోట్లు, 80కేజీల వెండి, 15కేజీల బంగారు ఆభరణాలను అధికారులు వెలికితీశారు.

ప్రత్యేక ఆర్థిక నిబంధనల ప్రకారం డ్యూటీ ఫ్రీ పద్దతిలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని అక్రమంగా కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తానికి లెక్క చెప్పలేకపోవడంతో ఐటీ అధికారులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ  కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments