Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. మృగాడిని ఉరితీసిన గ్రామస్తులు...

Webdunia
గురువారం, 30 జులై 2015 (17:36 IST)
మహిళలు, బాలికలపై హత్యాచారాలు, ఆఘాయిత్యాలకు పాల్పడేవారికి వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్ల ఆగడాలు ఆగడంలో లేదు. దీంతో ప్రజలే మృగాళ్ల భరతం పడుతున్నారు. తాజాగా బీహార్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన మృగాడిని గ్రామస్తులు చితకబాది ఉరితీసి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో బాలిక అరుపులు, ఏడుపు విన్న ప్రజలు, హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ బాలిపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
 
ఆ సమయంలో తీవ్ర ఆవేశానికిగురైన గ్రామస్తులు తొలుత అతడిని చితకబాదారు. అనంతరం ఆ మృగాన్ని గ్రామస్తులు ఉరితీసి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మరో 11 మంది కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘట ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments