గుజరాత్‌: ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 13 మంది మృతి

Webdunia
బుధవారం, 18 మే 2022 (16:04 IST)
గుజరాత్‌లో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బి జిల్లా హల్వాద్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మందికిపైగా కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 
 
సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద మరికొంత మంది మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు.  
 
క్షతగాత్రులును స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
కాగా, మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో చాలా మంది కూలీలు తినడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. లేదంటే.. చాలా మంది ఈ ప్రమాదంలో బాధితులయ్యేవారని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments