Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ మండపంలో వధూవరులపై యాసిడ్ దాడి

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (12:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కళ్యాణ మండపంలో నూతన వధూవరులపై ఈ యాసిడ్ దాడి జరిగింది. వధూవరులపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో వధువు, వరుడు, ఇద్దరు పిల్లతో పాటు మొత్తం 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 
 
పెళ్లి వేడుకలో కరెంట్ పోయిన సమయంలో ఈ దాడి జరగడంతో ఎవరు దాడి చేశారన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి యాసిడ్ దాడి చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భాన్‌పురి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. బస్తర్ జిల్లాలోని ఛోటే అమాబల్ గ్రామంలో సుధాపాల్ నివాసి దమ్రు బాఘేల్ (23), సునీత్ కశ్యప్ (19)లకు పెద్దలు పెళ్లి నిశ్చయించడంతో వారి వివాహం ఘనంగా జరుగుతుంది. ఇందులో కరెంట్ పోవడంతో కళ్యాణ మండలంలో అంధకారం నెలకొంది. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు వధూవరులపై యాసిడ్ దాడి చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments