Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (22:27 IST)
Hathras
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం జరిగిన ఒక మతపరమైన సభలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మహిళలు, పిల్లలతో సహా 116 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అలీఘర్ రేంజ్ ఐజి శలభ్ మాథుర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ: "ఇప్పటి వరకు, 116 మరణాలు నిర్ధారించబడ్డాయి. 
 
ఇరవై ఏడు మృతదేహాలు ఎటాలోని మార్చురీలో ఉన్నాయి. మిగిలినవి హత్రాస్‌లో ఉన్నాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం వివిధ ఆసుపత్రులకు పంపుతున్నారు. "గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగింది." అంటూ చెప్పుకొచ్చారు.
 
భోలో బాబాగా పిలుచుకునే నారాయణ సకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో సత్సంగం ఏర్పాటు చేయగా, సత్సంగం ముగుస్తుందనగా ఒకేసారి అందరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయడం, సభా స్థలి చిన్నది కావడంతో పలువురికి ఊపిరి ఆడలేదని, కొందరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు. దీనిపై విచారణ జరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments