Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ వంద రోజులనపై కాంగ్రెస్ సెటైర్లు

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (17:37 IST)
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ప్రధాని మోడీ సారథ్యంలోన ఈ బీజేపీ సర్కారు పాలనపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. వందరోజుల పాలనలో దౌర్జన్యం, గందరగోళం, అరాచకం తప్ప సాధించిందేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. మూక దాడులు, రాజ్యాంగ ఉల్లంఘన వంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వం దేశ సమగ్రతను తీవ్రంగా దెబ్బతీసిందని మండిపడింది. ఈ మేరకు ఆదివారం తన అధికార ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ వీడియోను విడుదల చేసింది.
 
'బీజేపీ వంద రోజుల పాలనలో ప్రజలపై దౌర్జన్యం, అరాచకం పాలన గందరగోళం తప్ప మరేమీ లేదు. బీజేపీ ఎన్నికల వాగ్ధానమైన సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ కేవలం నినాదంగానే మిగిలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బ్యాంకులు దీవాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయి. నిరుద్యోగ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. రైతులు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేకపోయింది. 
 
జమ్మూ కాశ్మీర్ రెండుగా విభజించి అక్కడి ప్రజలను మరింత దూరం చేసింది. వివాదాస్పద ఎన్‌ఆర్సీతో దేశ ప్రజలను బీజేపీ పాలకులు విదేశీయులుగా గుర్తిస్తున్నారు. రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతూ.. కేంద్రమాజీ మంత్రి చిదంబరంను తప్పుడు కేసుల్లో ఇరికించారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా సమాచార శాఖ, ఉపా వంటి చట్టాలను సవరించారు' అంటూ సుదీర్ఘ వీడియోను పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments