Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండుగా విడిపోయిన లోహిత్ ఎక్స్‌ప్రెస్

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (08:32 IST)
ఇటీవలికాలంలో వరుస రైలు ప్రమాద ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, ఈ రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలోని బహనగ బజాప్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, గూడ్సు రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. తాజాగా లోహిత్ ఎక్స్‌ప్రెస్ రెండుగా విడిపోయింది. 
 
కటిహార్‌ జిల్లాలో గౌహతి నుంచి జమ్మూకు వెళ్లే లోహిత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిను నుంచి సుమారు 10 బోగీలు విడిపోగా.. మిగిలిన రైలు మాత్రం కొంతదూరం అలాగే పరుగులు తీసింది. బిహార్‌ - బెంగాల్‌ సరిహద్దులోని నార్త్‌ దినాజ్‌పుర్‌ జిల్లాలో ఉన్న దల్ఖోలా స్టేషను సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చాలామంది ప్రయాణికులు ప్రాణభయంతో కిందికి దూకేశారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను కాసేపు నిలిపివేసి, రెండు భాగాలను జత చేశాక రైలు మళ్లీ అక్కడ నుంచి బయలుదేరి వెళ్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments