Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి పుట్టిన రోజే ఆ బిడ్డకు మృత్యుదినమైంది.. అమ్మ చేతి ముద్దతో ప్రాణం పోయింది..!

పుట్టిన రోజే ఆ బాబుకు మృత్యుదినమైంది. తొలి పుట్టిన రోజును మంచిగా జరుపుకోవాలని.. కేక్ కట్ చేయాలని.. పక్కింటి పిల్లలకు చాక్లెట్ ఇవ్వాలని ఆత్రుతగా ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది. సరిగ్గా ఏ

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (16:55 IST)
పుట్టిన రోజే ఆ బాబుకు మృత్యుదినమైంది. తొలి పుట్టిన రోజును మంచిగా జరుపుకోవాలని.. కేక్ కట్ చేయాలని.. పక్కింటి పిల్లలకు చాక్లెట్ ఇవ్వాలని ఆత్రుతగా ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది. సరిగ్గా ఏడాది ప్రాయంతోనే ఆ బిడ్డ ఆయుష్షు ముగిసిపోయింది. తల్లి పెట్టిన అన్నం ముద్దే ఆ బిడ్డ పాలిట శాపంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే? తల్లి పెట్టిన అన్నం ముద్ద గొంతులో చిక్కుకుపోవడంతో చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన వీర్ల గోవర్ధన్‌ సునీత దంపతుల రెండో కుమారుడు సందీప్‌ (1) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం తల్లి అన్నం తినిపిస్తుండగా ముద్ద గొంతుకు అడ్డుపడింది. దీంతో శ్వాస పీల్చుకోలేక కొట్టుమిట్టాడాడు. దీంతో సందీప్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పుట్టిన రోజునాడే చిన్నారి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments