Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణశిక్ష

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2009 (13:06 IST)
గత 2003 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన జంట వరుస పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి మరణ శిక్ష విధిస్తూ పోటా కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అష్రాత్ షఫీక్ అన్సారీ (32), మహ్మద్ హనీఫ్ సయీద్ (46), ఈయన భార్య ఫెమీదా సయీద్ (43)లు దోషులుగా ఉన్న విషయం తెల్సిందే.

ఈ కేసు విచారణకు దాదాపు ఆరు సంవత్సరాల కాలం పట్టింది. 2003లో జరిగిన ఈ పేలుళ్లలో 52 మంది మృతి చెందగా, 226 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జ్వల్ నిఖమ్ వాదిస్తూ.. దోషులుగా తేలిన ముగ్గురికి కఠిన శిక్ష విధించాలని గట్టిగా వాదించిన విషయం తెల్సిందే.

ఆయన ఊహించినట్టుగానే దోషులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా, ఈ పేలుళ్లు 2003 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, అత్యంత రద్దీగా ఉండే దక్షిణ ముంబైలోని జావేరి బజార్‌లలో బాంబు పేలుళ్లు సంభవించాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments