మాధవన్ నాయర్‌పై వ్యక్తిగత కక్ష లేదు : కె.రాధాకృష్ణన్

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (05:49 IST)
యాంట్రిక్స్-దేవాస్ ఒప్పందం విషయంలో ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రస్తుత ఇస్రో చీఫ్ కె.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. తనను ఏమాత్రం విచారించకుండానే ఒప్పందంలో అనేక లొసుగులు చోటుచేసుకున్నట్లు అధికార నివేదికలో పేర్కొన్నారని, ఇది పిరికిపంద చర్యగా ఉందని నాయర్ ఆరోపణలు చేస్తున్నారు.

దీనిపై రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఒప్పందంలోని లోపాలు, లొసుగులు, సిఫారసులను వివరిస్తూ ప్రత్యూష్ సిన్హా కమిటీ తమకు అందజేసిన లేఖ పూర్తి పాఠాన్ని నాయర్‌తో పాటు మరో ఏడుగురు అధికారులకు పంపామని చెప్పారు.

ఈ కమిటీ గత జూలైలో పంపిన లేఖకు నాయర్ వివరణ ఇచ్చారని వివరించారు. తర్వాత వ్యక్తిగతంగా తన వాదన వినిపించుకునేందుకు కూడా నాయర్‌కు కమిటీ చైర్మన్ అనుమతి ఇచ్చారన్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవు. మేం ఎక్కడా పిరికివారిలా వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

Show comments