Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంద్యానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణం

Webdunia
పెట్టుబడుల ప్రవాహాన్ని, ఎగుమతులను ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు, ఎగుమతులు మందగించడానికి ఆర్థిక మాంద్యం కారణమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ మంగళవారం మాట్లాడుతూ.. వ్యవస్థపరమైన వైఫల్యాన్ని అధిగమించేందుకు ప్రపంచ దేశాల మధ్య పరస్పర, మెరుగైన సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ ఈ చర్యలు కోరుకుంటుందన్నారు.

మనం చూస్తున్న అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధిరేటును ప్రభావితం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

అయితే ఇది మన తప్పు వలన జరిగింది కానప్పటికీ, మనం బాధితులయ్యామని రెండు రోజులపాటు ఇటలీలో జరిగే జి- 8 సమావేశానికి బయలుదేరి వెళుతున్న సందర్భంగా మన్మోహన్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జి- 8 పారిశ్రామిక దేశాల సమావేశం జులై 9న ప్రారంభం కానుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments