దేశంలో మహిళల సామాజిక భద్రత మరింత పటిష్టం చేయవలసిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ వెల్లడించారు. సామాజిక భద్రతను పెంచడం ద్వారా దేశంలో అసాంఘిక శక్తుల అరాచకాలను అరికట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీలో సోమవారం మానవహక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ మహిళ హక్కులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలన్నారు.
ఈ హక్కులకు రక్షణ పూర్తి స్థాయి రక్షణ కల్పించడం ద్వారా దేశంలో ఎన్నో ఒడిదుడుకులను, మహిళా వ్యతిరేక చర్యలను అడ్డుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో మహిళ లైంఘిక వేధింపులకు గురి అవుతోందని ఆమె వెల్లడించారు.