Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురై సమీపంలో పేలుడు: ముగ్గురి మృతి

Webdunia
తమిళనాడులోని మధురై ప్రాంతానికి సమీపంలోనున్న చోళవందన్‌ రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రగాయాలపాలైనారు.

మధురై జిల్లాలోని చోళవందన్ రైల్వే స్టేషన్‌‌లో మంగళవారం భారీ పేలుడు జరగడంతో ముగ్గురు మృతి చెందగా ఆరుగురికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

మైలాడుదురై నుంచి తిరునల్వేలీకి వెళుతున్న ప్యాసింజర్ రైలు చోళవందన్‌ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఈ పేలుడు సంభవించింది. మృతుల్లో టీటీఈ మరియు ఆర్‌పీఎఫ్ జవాన్‌లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

పేలుడుకు తగిన కారణాలు ఇంకా తెలియరాలేదని, బహుశా టపాసులకు సంబంధించిన మందుగుండు సామగ్రి రవాణా చేస్తున్న సందర్భంలో ఈ దుర్ఘటన జరిగివుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఏదేమైనప్పటికీ ఉగ్రవాదులేమైనా ఈ చర్యలకు పాల్పడ్డారేమోననే కోణంలో కూడా తాము విచారణ చేపట్టామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే రైల్వే స్టేషన్ జనాలతో నిండిపోయిందని, తీవ్రగాయాలపాలైనవారిని తాము చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు వివరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments