Webdunia - Bharat's app for daily news and videos

Install App

భన్వరిదేవిని చంపేశారు : హైకోర్టుకు తెలిపిన సీబీఐ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2012 (17:22 IST)
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టిన నర్సు భన్వరిదేవి హత్య కేసులో సీబీఐ ఆ రాష్ట్ర హైకోర్టులో నివేదికను సమర్పించింది. ఇందులో భన్వరిదేవిని హత్య చేసినట్టు పేర్కొంది. ఈ హత్యతో కొందరు రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్లు తన నివేదికలో పేర్కొంది.
సీబీఐ మొదటిసారి అధికారికంగా తన నివేదికలో నర్సు భన్వరిదేవి తప్పిపోయిన నాలుగు నెలల తర్వాత హత్యకు గురైనట్టు ధృవీకరిస్తూ నివేదికను కోర్టుకు సమర్పించడం గమనార్హం.

భన్వరిదేవి మృతదేహానికి సంబంధించి ఎముకలు, ఆమె ధరించిన చేతి గడియారం, చెవి పోగులను 25 అడుగుల లోతైన కాలువలో ఇటీవల కనుగొన్న విషయం తెల్సిందే. ఈ వస్తువులను భన్వరిదేవి తనయుడు సాహిల్ కూడా గుర్తించాడు.

సేకరించిన వస్తువులను మూడు రోజుల పాటు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో నిశితంగా పరిశీలించిన తర్వాత భన్వరిదేవికి చెందినవిగా నిర్ధారించారు. అలాగే, రెండు తుపాకీలు, గోనె సంచి, బ్యాట్, కొన్ని ఎముకల శకలాలు, మొబైల్ ఫోన్, చెవిరింగులు, వాచ్ మరియు బ్రాస్లెట్‌ను ఆ ప్రాంతంలో కనుగొన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments