Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో నితీష్‌కే మళ్లీ పట్టం: ఎగ్జిట్‌పోల్స్ సర్వే ఫలితాలు

Webdunia
బీహార్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మళ్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కే ఆ రాష్ట్ర ఓటర్లు పట్టంకట్టనున్నట్టు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. జేడీయూ-భాజపా నేతృత్వంలోని ఏన్డీయే కూటమి ఈ దఫా ఏకంగా 26 శాతం మేరకు ఓట్లను మెరుగుపరుచుకోనుందని వెల్లడించింది. ఫలితంగా నితీష్ కుమార్ కూటమి 180 నుంచి 205 సీట్లను కైవసం చేసుకోవచ్చని ఈ ఫలితాలు తేల్చాయి.

మొత్తం 243 సీట్లు కలిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 24వ తేదీన వెల్లడికానున్నాయి. నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికే ఓటర్లు పట్టంకట్టనున్నట్టు సీఎన్ఎన్-ఐబీఎన్ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో తేటతెల్లమైంది. ఇకపోతే.. కేంద్ర మాజీ మంత్రులు ఆర్జేడీ-ఎల్జేపీ అధినేతలు లాలూ ప్రసాద్ యాదవ్- రామ్ విలాస్ పాశ్వాన్‌ల నేతృత్వంలోని కూటమి ద్వితీయ స్థానానికే పరిమితం కానుందని పేర్కొంది.

ఈ కూటమికి 22 నుంచి 33 సీట్లు దక్కవచ్చని అంచనా వేయగా, కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 12 సీట్లతో మూడో స్థానంతో సరిపుచ్చుకోనుంది. ఇతరులు 9 నుంచి 19 సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆ సర్వే వెల్లడించింది. బీహార్ అసెంబ్లీకి మొత్తం ఆరు దశల్లో జరిగిన ఎన్నికలు శనివారంతో ముగిసిన విషయం తెల్సిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments