దారిద్ర్యరేఖకు దిగువున జీవించే పేదలకు నెలకు 25 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం (పీసీ) తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన శివగంగై (తమిళనాడు)లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో బీపీఎల్ దిగువున నివశించే పేదలకు 25 కేజీల బియ్యాన్ని కేంద్రం పంపిణీ చేస్తుందన్నారు.
పేదల సంక్షేమానికి కేంద్రంలోని యూపీఏ సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 2010-11 వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు.
అంతకుముందు.. ఆయన తన నియోజకవర్గం పరిధిలోని తిరుపత్తూరు, సింగంపునరి పంచాయతీ యూనియన్లకు చెందిన ఎన్.పుదూర్, కలాంపట్టి గ్రామాల్లో ఓపెన్ మ్యారేజ్ హాల్స్ను ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు.