Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియదర్శిని మట్టూ కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Webdunia
ప్రియదర్శిని మట్టూ హత్య కేసులో నిందితుడుకి సుప్రీం కోర్టు కాస్త ఊరట కలిగించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంతోష్ సింగ్‌కు 2006లో ఢిల్లీ హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేయగా.. సంతోష్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్మానించింది.

న్యాయశాస్త్రంలో విద్యాభ్యాసం చేస్తున్న ప్రయదర్శిని మట్టూ జనవరి 1996లో న్యూఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న తన నివాసంలో ప్రియదర్శిని సహ విద్యార్థి అయిన సంతోష్ సింగ్ అత్యాచారం జరిపి హత్య చేశాడు. సంతోష్ సింగ్ మాజీ ఐపిఎస్ కుమారుడు. కాగా.. ఈ కేసులో విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు అక్టోబర్ 2006లో నిందింతుడిపై అత్యాచారం హత్య కేసులు నమోదు చేసి ఉరిశిక్షను విధించింది.

ఈ తీర్పు అనతంరం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సింగ్‌కు సుప్రీం కోర్టు కాస్త ఊరట కలిగిస్తూ.. మరణశిక్షను రద్దు చేసి.. జీవిత ఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై ప్రియదర్శిని మట్టూ తండ్రి సి ఎల్ మట్టూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టుల నుంచి నిందితులకు సరైన శిక్ష పడుతుందని ఆశించామని, కనీసం ఈ జీవిత ఖైదునైనా తగ్గించకుండా ఉంటే చాలునని ఆయన అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments