Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని వెంటనే రాజీనామా చేయాలి: సుష్మ స్వరాజ్ డిమాండ్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2011 (15:30 IST)
విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలను నియంత్రించలేని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ గురువారం లోక్‌సభలో డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలను కట్టడిలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి పదవి నుంచి మన్మోహన్ సింగ్ తప్పుకోవాలన్నారు.

ధరల పెరుగులదలపై లోక్‌సభలో చర్చ సాగింది. ధరల పెరుగుదలపై విపక్షాలు లోక్‌సభలో మండిపడ్డాయి. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. కేంద్రం సగటు మనిషిని విస్మరిస్తోందని దుయ్యబట్టారు. ధరలను తగ్గించకుండా కేంద్రం సాకులు చెబుతోందని ధ్వజమెత్తారు.

ధరల నియంత్రణకు లోక్‌సభలో రెండుసార్లు తీర్మానం చేసినా ఫలితం శూన్యమని సుష్మా వ్యాఖ్యానించారు. అయితే సుష్మా వ్యాఖ్యలను కేంద్ర విత్తమంత్రి ఖండించారు. ధరల నియంత్రణకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల నుంచి 6.6 శాతానికి తగ్గిందని ప్రణబ్ వెల్లడించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments