Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలతో గడపడమే ఆయనకు ఇష్టం: గోకుల్ బైరాగి

Webdunia
ఆదివారం, 17 జనవరి 2010 (17:54 IST)
FILE
దివంగత నేత, కమ్యూనిస్టు యోధుడు, మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా, సాధారణ కార్యకర్తగా వ్యవహరించే వారని, ఎల్లప్పుడూ ప్రజలతో గడపడమే ఆయనకు చాలా ఇష్టంగా ఉండేదని ఆయన దగ్గర ఎలక్షన్ ఏజెంట్‌‍గా వ్యవహరించిన గోకుల్ బైరాగి అన్నారు.

బసు మృతి చెందారన్న వార్త వినగానే గోకుల్ కళ్ళనీళ్ళపర్యంతమైనాడు. ఆయనతో తను గడిపిన మధుర స్మృతులను మననం చేసుకుంటు మీడియాకు వెల్లడించాడు. తమ ఆరాధ్యదైవం, ఆప్యాయతలు పంచే నేత గదిలో తలుపులు మూసుకుని చర్చలు జరపడం కన్నా ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల మధ్య ఉండడానికే ఇష్టపడేవారని గోకుల్‌ అన్నారు.

తాను 1982 నుంచీ జ్యోతిబసు దగ్గర ఏజెంటుగా ఉన్నానని బైరాగి తెలిపారు. ఆయనకు వందలాది ప్రజలనుద్దేశించి మాట్లాడడమే చాలా ఇష్టమని చెప్పారు. వీధి చివర పదిమంది చేరినా చాలు బసు వారితో ప్రజా సమస్యల గురించి చర్చలు మొదలుపెట్టేవారన్నారు. తప్పనిసరిగా కొన్ని సమావేశాలకు ఆయన హాజరుకావలసి వచ్చేది. కానీ ఆయన హృదయం మాత్రం మూసిన గది తలుపుల మాటున ఉండలేకపోయేదని చెప్పారాయన.

వ్యక్తిగా, రాజకీయ వేత్తగా జ్యోతిబసు ఉదాత్తమైన వ్యక్తిత్వాన్ని కలిగివుండేవారని, ఎటువంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోయే వారుకాదని ఇలాంటి నేతలు ఇక భవిష్యత్తరాల వారికి కనపడరని గోకుల్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments