పొరుగు దేశాలపై డేగ కన్ను: ఎలక్ట్రానికి నిఘా వ్యవస్థ!

Webdunia
శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ముందుగానే పసిగట్టేందుకు వీలుగా భారత్ తన గూఢచార నిఘా వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఇందులోభాగంగా.. పొరుగు దేశాల కదలికలపై నిరంతరం డేగకన్ను వేసి ఉంచడానికి అవసరమైన నిఘా పెట్టి ఉంచగల ఎలక్ట్రానికి గూఢచార వ్యవస్థను రూపొందించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అధీనంలోని హైదరాబాద్‌కు చెందిన రక్షణ ఎలక్ట్రానిక్స్, పరిశోధనా లేబోరేటరీ (డిఆర్‌డిఎల్) ఈ వ్యవస్థను రూపొందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఉపగ్రహానికి బిగించే ఈ పరికరాన్ని "స్పై శాటిలైట్’ (గూఢచార ఉపగ్రహం)గా డిఆర్‌డిఓ అధికారి ఒకరు అభివర్ణించడం గమనార్హం.

మన దేశంపై కయ్యానికి కాలుదువ్వే పొరుగుదేశం మీదుగా ఉపగ్రహం వెళ్లేటప్పుడు ఉపగ్రహానికి బిగించిన ఈ పరికరం, ఆ దేశ బలగాలు, ఇతర వనరులకు సంబంధించిన ఫోటోలు తీస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు ఇప్పటికే ఈ తరహా వ్యవస్థను కలిగి ఉన్నట్టు ఆ వర్గాలు గుర్తు చేశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

Show comments