తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యతో రాసలీలల్లో నిమగ్నమైవున్న ప్రేమికుడిని ఆ మహిళ భర్త దారుణంగా హత్య చేశాడు. చెన్నై రాజధాని శివారు ప్రాంతమైన మదురవాయల్లో ఈ దారుణం ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
మదురవాయల్, రాజీవ్ గాంధీ నగర్కు చెందిన శక్తివేల్ (33) పెయింటర్గా పని చేస్తున్నాడు. ఈయనకు భవనేశ్వరి (29) అనే మహిళతో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, శక్తివేల్ ఇంటి పక్కనే ఉన్న ఓ కిరాణా దుకాణం యజమాని సతీష్ (27)తో భవనేశ్వరికి పరిచయం ఏర్పడింది. సతీష్ బ్రహ్మచారి కావడంతో వారిద్దరి పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది.
దీంతో తన భర్త ఇంట్లో లేని సమయంలో సతీష్ను భువనేశ్వరి ఇంటికి పిలుపించుకుని సెక్స్లో పాల్గొంటూ వచ్చారు. ఈ విషయం గత ఆరు నెలల క్రితం శక్తివేల్కు తెలియడంతో భార్యతో పాటు.. సతీష్ను మందలించారు. తన కాపురాన్ని నాశనం చేయవద్దని ప్రాధేయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పనికి వెళ్లిన శక్తివేల్.. రాత్రి ఇంటికి రానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో భువనేశ్వరి ఎక్కడలేని ఆనందంతో తన ప్రియుడు సతీష్ను ఇంటికి పిలిపించుకుని తన పక్కలో పనుకోబెట్టుకుని లైంగిక చర్యలో నిమగ్నమైంది. అయితే, శక్తివేల్ అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి తలుపులు కొట్టాడు.
వెంటనే తలుపులు తీసిన భువనేశ్వరి భర్త రావడంతో షాక్కు గురై.. మద్యం సేవించి ఇంటికి వచ్చేందుకు వేళాపాళా లేదా అంటూ భర్తపై మండిపడుతూ తలుపు వేసేందుకు ప్రయత్నించింది. కానీ, శక్తివేల్ సందేహించి తలపులను బలంగా తోసి ఇంట్లోకి ప్రవేశించి తలుపుకు గడియపెట్టాడు. అపుడు బీరువా పక్కన దాగివున్న సతీష్ను చూడటంతో ఆగ్రహంతో ఊగిపోయిన శక్తివేల్.. పక్కనే ఉన్న కత్తితో కడుపులో పొడిచాడు.
అంతటితో అతని కసి చల్లారక పోవడంతో సతీష్ను ఇంటి బయటకు తీసుకొచ్చి.. పక్కనే ఉన్న చాంతాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.