చిన్నపాటి సర్జరీ తర్వాత అమెరికాలో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ నేడో రేపో స్వదేశానికి చేరుకోనున్నారు. కాంగ్రెస్ వర్గాల కథనం మేరకు.. సోనియా గాంధీ సోమవారం లేదా మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
సోనియాను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆమె కుమార్తె ప్రియాంక అమెరికా చేరుకున్నారు. ఆమె న్యూఢిల్లీకి చేరుకున్న తర్వాత పార్టీ, అధికార, అనధికార కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
గత నెల మొదటివారంలో అమెరికా వెళ్లి న్యూయార్క్లోని ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెల్సిందే. ఆమె క్యాన్సర్తో బాధ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. గత నెల రోజులుగా అమెరికాలో ఉంటున్నారు.