Webdunia - Bharat's app for daily news and videos

Install App

నియంత్రణ రేఖపై చొరబాట్లు పెరిగాయి: ప్రధాని

Webdunia
జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖపై పాక్‌వైపు నుంచి చొరబాట్లు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. మిలిటెంట్ గ్రూపులు కాశ్మీర్‌లోకి చొరబడుతుండటం ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అస్థిరత్వాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.

ఇటువంటి ప్రయత్నాలను ఏమాత్రం ఉపేక్షించరాదని హెచ్చరించారు. నియంత్రణ రేఖతోపాటు, నేపాల్, బంగ్లాదేశ్, సముద్ర సరిహద్దులు, తదితర మార్గాల గుండా దేశంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహిస్తున్న రెండు రోజుల డీజీపీ, ఐజేపీల సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ పైవిషయాలు వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం, జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్ కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు శాంతియుతంగా జరగడం సంతృప్తి కలిగిస్తోందని ప్రధాని అన్నారు. అంతేకాకుండా 1980 సమయంతో పోలిస్తే రాష్ట్రంలో ఇప్పుడు హింసాకాండ గణనీయంగా తగ్గిందని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో చొరబాట్లు పెరుగుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, ముఖ్యంగా ఇటీవలి కాలంలో సాయుధ మిలిటెంట్లతో తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments