Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయర్‌పై వ్యక్తిగత కక్ష లేదు : ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2012 (11:58 IST)
ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్‌పై తనకు వ్యక్తిగత కక్ష లేదా విభేదాలు లేవని ప్రస్తుత ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. ఎస్ బ్యాండ్‌ల కేటాయింపు కోసం కుదుర్చుకున్న యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిన మాట నిజమేనని ఆయన చెప్పుకొచ్చారు.

తనపై మాధవన్ నాయర్ ఇటీవల చేసిన ఆరోపణలపై రాధాకృష్ణన్ బుధవారం స్పందించారు. ఇస్రో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే ఒప్పందంలో చేటు చేసుకున్న అవినీతిని బయటపెట్టినట్టు ఆయన తెలిపారు. అంతేకానీ, నాయర్‌పై తనకు వ్యక్తిగత కక్షలు ఏమీ లేవన్నారు.

ఇదిలావుండగా, అంతరిక్ష రంగంలో ఎస్-బ్యాండ్ స్కాంను తవ్వితీసిన కీలక నివేదికలు త్వరలోనే వెలుగు చూడనున్నాయి. ఇస్రో మాజీ అధిపతి మాధవన్ నాయర్ హయాంలో కుదిరిన యాంత్రిక్స్- దేవాస్ ఒప్పందం కారణంగా ఖజానాకు వేలాది కోట్ల రూపాయల గండి పడిందని మొత్తం మూడు కమిటీలు ఇప్పటికే నిర్ధారించడం, వీటి ఆధారంగా నాయర్, మరో ముగ్గురు శాస్త్రవేత్తలపై కేంద్ర ప్రభుత్వం వేటు వేయడం తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments