Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా 63కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు

Webdunia
దేశంలో కొత్తగా మరో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య 62కి చేరింది. దేశ రాజధానిలో తాజాగా మరో ఇద్దరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధిని అదుపు చేసేందుకు బహుముఖ వ్యూహాన్ని పాటించామని, అది సత్ఫలితాలను ఇస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీలో కొత్తగా రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదవగా, పూణే, ముంబయి నగరాల్లో మిగిలిన రెండు కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి దేశ రాజధానికి వచ్చిన 25 ఏళ్ల వ్యక్తికి ఒకరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే కెనడా నుంచి వచ్చిన 29 ఏళ్ల మహిళకు కూడా ఈ వ్యాధి సోకిందని ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు.

తాజాగా నమోదయిన రెండు కేసులతోసహా, దేశ రాజధానిలో నిర్ధారణకు వచ్చిన మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 26కి చేరింది. అమెరికా నుంచి పూణే వచ్చిన 24 ఏళ్ల యువకుడిలోనూ స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. అతనికి వ్యాధి సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి ముంబయికి వచ్చిన 23 ఏళ్ల మహిళకు కూడా ఈ వ్యాధి సోకిందని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments