Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా 63కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు

Webdunia
దేశంలో కొత్తగా మరో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య 62కి చేరింది. దేశ రాజధానిలో తాజాగా మరో ఇద్దరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధిని అదుపు చేసేందుకు బహుముఖ వ్యూహాన్ని పాటించామని, అది సత్ఫలితాలను ఇస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీలో కొత్తగా రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదవగా, పూణే, ముంబయి నగరాల్లో మిగిలిన రెండు కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి దేశ రాజధానికి వచ్చిన 25 ఏళ్ల వ్యక్తికి ఒకరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే కెనడా నుంచి వచ్చిన 29 ఏళ్ల మహిళకు కూడా ఈ వ్యాధి సోకిందని ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు.

తాజాగా నమోదయిన రెండు కేసులతోసహా, దేశ రాజధానిలో నిర్ధారణకు వచ్చిన మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 26కి చేరింది. అమెరికా నుంచి పూణే వచ్చిన 24 ఏళ్ల యువకుడిలోనూ స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. అతనికి వ్యాధి సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి ముంబయికి వచ్చిన 23 ఏళ్ల మహిళకు కూడా ఈ వ్యాధి సోకిందని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

Show comments