న ఘటనలో మృతుల సంఖ్య 72కి చేరింది. దీనికి సంబంధించి ఇద్దరు బిల్డర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతిలేకుండా భవనాన్ని నిర్మిస్తున్న జమిల్ ఖురేషి, సలీమ్ షేక్ అనే బిల్డర్లను అరెస్టు చేసినట్లు థానే పోలీస్ కమిషనర్ కె.పి.రఘువన్షి వెల్లడించారు.
వీరిద్దరిపై పౌరుల మరణానికి కారణమయ్యారనే అభియోగాలపై వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో 72 మంది మరణించగా, 62 మంది గాయపడ్డారని థానే జాయింట్ పోలీస్ కమిషనర్ విపిన్ కుమార్ తెలిపారు. గాయపడ్డవారిలో 36 మందిని థానే, కల్వా, ముంబ్రాల్లోని ఆస్పత్రుల్లో చేర్పించారు.