Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం : చిదంబరం

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2013 (16:42 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఈ క్రమంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు అనేక అంశాలు పరిష్కరించాల్సి ఉందని, వాటన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన సోమవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. దీనిపై కేంద్ర హోం శాఖ సమగ్ర విధానపత్రాన్ని కేబినెట్ ముందుకు తీసుకొస్తుందని సభకు తెలిపారు.

దీనికి సంబంధించి ఓ నోట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో కొన్ని విధివిధానాలు ఉన్నాయని చిదంబరం గుర్తు చేశారు. ఈ విధాన పత్రంలో విద్యుత్, నదీ జలాలు, పంపిణీ, ప్రజల భద్రతా అంశాలు, ప్రాథమిక హక్కుల రక్షణ, ఇతర అంశాలు కూడా ఉంటాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును కేబినెట్ ఆమోదించాక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడుతుందని, ఆ సంఘం ముందు అందరూ తమ వాదనలు వినిపించవచ్చని వివరించారు. తగిన సమయంలో ఈ నోట్‌పై కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో చర్చకు అవకాశం ఇస్తుందని మంత్రి చిదంబరం తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments