ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని భారతీయ జనతా పార్టీ నాయకురాలు, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్లో రాశారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా యువత ఆత్మహత్యలకు పూనుకోరాదన్నారు. ఒకవేళ అలాంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటే తెలంగాణ సాధన కోసం జరుగుతున్న ఉద్యమం నుంచి తాను తప్పుకుంటానని ప్రకటించారు.
తెలంగాణ సోదర సోదరీమణులకు ముఖ్యంగా యువతకు ఇదే నా విజ్ఞప్తి. దయచేసి ఆత్మహత్యలు చేసుకోరాదని, ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించే రోజును చూడటం కోసం జీవించండి అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.