Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ వర్షాలు: 12 మంది మృతి

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2009 (19:10 IST)
FILE
తమిళనాడు రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దాదాపు 12 మంది మృతి చెందారు. ఈ భారీ వర్షాలు మరో రెండు రోజులుంటాయని శుక్రవారం నాడు వాతావరణ శాఖ ప్రకటించింది.

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ముగ్గురు, కాంచీపురం, కడ్డలూరు, తిరువాయూర్, పెరంబూర్, మదురై, కన్యాకుమారి, తిరునల్వేలీ, తిరుచ్చిరాపల్లి, విరుదనగర్ ప్రాంతాల్లో చెరో ఒకరు మృతి చెందారని అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా చాలామంది తమ ఇండ్లలోని గోడలు కూలి, పైకప్పులు కూలిపోయి మృతి చెందారని, అలాగే చాలామంది ఇండ్లు కూలిపోయాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, రానున్న మరో 48 గంటలపాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగాధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్ళరాదని అధికారులు సూచించారు.

ఇదిలావుండగా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments