Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్దారీకి విందు: నోరూరించే వంటకాల ఘుమఘుమలు..!

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2012 (11:55 IST)
FILE
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సూపర్ విందు నిచ్చారు. దక్షిణాది నుంచి మినీ మసాలాదోశ.. ఈశాన్య రాష్ట్రాల నుంచి సందేశ్... ఉత్తరాదికి చెందిన కబాబ్‌లను జర్దారీ లొట్టలేసుకుని మరీ తింటూ సూపర్ అనేశారు.

ఈ విందులో జర్దారీతోపాటు ఆయన కుమారుడు బిలావల్ భుట్టో, పాక్ విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్.. భారత్ తరఫున కేంద్ర మంత్రులు ఎస్ఎం కృష్ణ, చిదంబరం, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వివిధ రకాల వంటకాలను జర్దారీకి వడ్డించారు.

శాకాహారులకేమో పుదీనా సూప్.. పుచ్చకాయ ముక్కలు.. ఆ తర్వాత సర్సాన్ కే ఫూల్, సబ్జ్ షమ్మీ కబాబ్, మినీ మసాలా దోశ వడ్డించారు. మాంసాహారులకు తొలుత జైతూన్ ముర్గ్ షీక్, గోష్ట్ బర్రా కబాబ్, మాంసాహారంతో కూడిన మినీ మసాలా దోశ వడ్డించారు.
FILE


బిలావల్ భుట్టో పక్కనే రాహుల్ గాంధీ కూర్చున్నారు. లంచ్ జరుగుతున్నంతసేపూ ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. పాక్ హోం మంత్రి మాలిక్‌తో చిదంబరం చర్చలు జరిపారు. అంతేనా.. నాయకులంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా జోకులు వేసుకుంటూ ఈ విందులో పాల్గొన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments