Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూరు హోటల్‌ను ధ్వంసం చేస్తాం: అల్‌ఖైదా

Webdunia
FILE
కోయంబత్తూరులోని ఓ హోటల్‌ను బాంబు పేలుడుతో ధ్వంసం చేస్తామని ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. కోయంబత్తూరులో జూన్ 23వ తేదీ నుంచి ప్రాచీన తమిళ భాషపై అంతర్జాతీయ సదస్సు జరుగనుండటంతో.. కోవైలోని ఓ ప్రసిద్ధ హోటల్‌ను పేల్చి వేస్తామని అల్‌ఖైదా ఇ-మెయిల్ ద్వారా బెదిరించింది.

ప్రాచీన తమిళభాషపై జూన్ 23వ తేదీన జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఈ సదస్సుకు హాజరయ్యే ప్రముఖులపై అల్‌ఖైదా కన్నేసినట్లు సమాచారం.

ఇందులో భాగంగా.. కోయంబత్తూరు స్టేషన్, గీతాహాల్ రోడ్డులో గల హోటల్‌కు అల్‌ఖైదా పేరిట హెచ్చరికలు అందాయని కోయంబత్తూరు పోలీసులు తెలిపారు. అల్‌ఖైదా హిట్ లిస్టులో కోయంబత్తూరు హోటల్ ఉందని, అందుచేత తప్పకుండా హోటల్‌ను బాంబుతో పేల్చి వేస్తామని ఆ ఇ-మెయిల్‌లో పేర్కొన్నట్లు హోటల్ అధికారులు పోలీసులకు తెలియజేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇ-మెయిల్‌పై దర్యాప్తును క్రైం బ్రాంచ్ విభాగానికి అప్పగించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments