Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ నెట్‌వర్క్‌తో పొంచివున్న ముప్పు: ఆంటోనీ

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2010 (09:09 IST)
కంప్యూటర్ నెట్‌వర్క్‌తో దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచివుందని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, చైనీస్ హాకర్ల నుంచి ప్రమాదం ఏర్పడిందన్నారు. దేశ రక్షణ, దౌత్య విభాగాలకు చెందిన కంప్యూటర్ నెట్‌వర్క్‌ల నుంచి చైనీస్ హాకర్లు కీలక సమాచారాన్ని అపహరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను చేపట్టనున్నట్టు చెప్పారు.

దీనిపై ఆయన న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. సైబర్ నేరాల నిరోధానికి ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలతో కలిసి ఒక విపత్తుల నిర్వహణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన కోరారు. ఇటీవలి కాలంలో ప్రమాదకరమైన సైబర్ నేరాలు వెలుగు చూశాయన్నారు. ఇది సైబర్ భద్రతలోని లోపాలను ఎత్తిచూపినట్టుగా భావించాలన్నారు.

సైబర్ దాడులు, సైబర్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కంప్యూటర్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్‌టి), ఎన్‌టిఆర్‌ఓ, హోంశాఖ, ఐటి శాఖలు సమన్వయంతో ఒక విపత్తుల నిర్వహణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో కంప్యూటర్ నెట్‌వర్క్‌ల నుంచి కీలక సమాచారం అపహరణకు గురికాకుండా ఉండేందుకు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి ఆంటోనీ అభిప్రాయపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments