Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను కొట్టేసిన ఆర్జేడీ అధినేత లాలూ!

Webdunia
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందంటూ సీఎన్ఎన్-ఐబీఎన్ ఛానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొట్టిపారేశారు. 234 సీట్లు కలిగిన బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ-ఎల్జేపీ కూటమి మూడింట రెండు వంతుల మెజార్టీ దక్కుతుందని జోస్యం చెప్పారు.

న్యూస్ ఛానల్ సర్వే ఫలితాలపై లాలూ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తాను 1977 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఓటర్ల నాడి ఏమిటో అందరికన్నా తనకు బాగా తెలుసన్నారు. ఓటర్లు ఎన్డీఏను తిరస్కరించారని, అందువల్ల తన అంచనాల ప్రకారం తమ కూటమికి అధికారం దక్కుతుందన్నారు.

అంతేకాకుండా, న్యూస్ ఛానళ్ళ మధ్య నెలకొన్న పోటీని తట్టుకునేందుకు మీడియా ఇలాంటి చవకబారు పనులకు పాల్పడుతోందని ఆరోపించారు. మహిళా ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారన్న ఎగ్జిట్ పోల్ అంచనాలకు భిన్నంగా పేద, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల మద్దతు తమ కూటమికే ఉందన్నారు. పైపెచ్చు.. తమ సంప్రదాయ ఓటర్లలో వారి సంఖ్యే అధికంగా ఉందని ఆయన గుర్తు చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments