దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతిపై మరో స్వాతంత్య్ర పోరాటం జరపాలని ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అననా హజారే పిలుపునిచ్చారు. అంతేకాకుండా, దేశానికి ఇప్పటికీ నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి నిజమైన స్వాతంత్య్రాన్ని సాధించేందుకు, అవినీతిని అంతమొందించేందుకు రెండో స్వాతంత్య్ర సంగ్రామాన్ని మొదలెట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
భారత్కు అసలైన స్వాతంత్య్రాన్ని సాధించేందుకు.. జైలుకెళ్లేందుకైనా మనం సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి వ్యతిరేక భారత్ ర్యాలీని ఉద్దేశించి ఆయన పుణేలో మాట్లాడారు అవినీతిపై ఎక్కువెప్టిటన లోక్పాల్ బిల్లు నిర్దేశించిన సమయంలోగా ఆమోదం పొందకపోతే.. మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దీనికి సన్నద్ధం కావాలంటూ జాతికి పిలుపునిచ్చారు.
జన్ లోక్పాల్ బిల్లు చట్టంగా రూపొందిన మరుసటి క్షణం నుంచి దేశంలో అవినీతి నిర్మూలన ప్రారంభమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన ప్రతిబంధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న ప్రతి రూపాయిలోనూ 10 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతోందన్నారు.