Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తకంపై నిషేధం ఎత్తివేత: జశ్వంత్ హర్షం

Webdunia
గుజరాత్ హైకోర్టు శుక్రవారం రాష్ట్రంలో తాను రాసిన "జిన్నా: భారత్, విభజన, స్వాతంత్ర్ర్యం" పుస్తకంపై నిషేధం ఎత్తివేయడం పట్ల బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జశ్వంత్ సింగ్ జిన్నాపై రాసిన వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నిషేధం ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ గుజరాత్ హైకోర్టు నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. జశ్వంత్ సింగ్ మాట్లాడుతూ తాజా కోర్టు తీర్పు సంతృప్తికరంగా ఉందన్నారు. తన పుస్తకంపై నిషేధం ఎత్తివేయడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యంగం కల్పించిన భావ ప్రకటన హక్కును కోర్టు కాపాడిందన్నారు.

మనమందరం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. జిన్నా: భారత్, విభజన, స్వాతంత్ర్ర్యం పుస్తకాన్ని నిషేధించేందుకు దేనిని ప్రాతిపదికగా తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం వివరించలేదని, అందువలన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments