సాహస యాత్రలను నిర్వహించే ఆపరేటర్ల సమాఖ్య ఆరవ సదస్సును కేంద్ర పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనీ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సాహస పర్యాటకం ప్రాధాన్యతను వెల్లడించే 30 సెకన్ల నిడివిని కలిగిన టీవీ కమర్షియల్ను మంత్రి విడుదల చేస్తారు. అదే సమయంలో 2007 సంవత్సరానికి నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం తాలూకు నివేదికను అంబికా సోనీ ఆవిష్కరిస్తారు.
' అడ్వంచర్ టూరిజమ్ : ది నెక్స్ట్ స్టెప్' ప్రధాన శీర్షికగా జరిగే ఈ సదస్సులో సాహస యాత్రా రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. పర్యాటక పరిశ్రమలో సాహస యాత్ర అత్యంత ప్రధానమైన విభాగాలో ఒకటి. జాతీయ మరియు అంతర్జాతీయ సాహస పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని పర్యాటక మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను చేపట్టింది.