Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి.. లింగోద్భవ పూజ.. అభిషేకానికి పాలు, పండ్లు ఇస్తే?

మహాశివరాత్రి పూట రాత్రి ఆలయాల్లో లింగోద్భవం అవతారాన్ని స్మరించుకుంటూ నాలుగు కాలాల పూజ జరుగుతుంది. ఈ నాలుగు కాలాల పాటు మహేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. శివలింగానికి పాలు, పంచామృతం, పండ్లు వంటి వాటితో

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (11:14 IST)
మహాశివరాత్రి పూట రాత్రి ఆలయాల్లో లింగోద్భవం అవతారాన్ని స్మరించుకుంటూ నాలుగు కాలాల పూజ జరుగుతుంది. ఈ నాలుగు కాలాల పాటు మహేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. శివలింగానికి పాలు, పంచామృతం, పండ్లు వంటి వాటితో అభిషేకం చేస్తారు. అయితే తొలి, మలి, మూడు, నాలుగు కాలాల్లో ఏయే పదార్థాలతో అభిషేకం చేయాలని తెలుసుకుందామా.. అయితే ఈ కథనం చదవండి. 
 
మహాశివరాత్రి రోజున శివునికి అభిషేక వస్తువులను, సుగంద ద్రవ్యాలను సమకూర్చే వారికి సకల సంపదలు చేకూరుతాయంటారు ఆధ్యాత్మిక పండితులు. అలాగే శివరాత్రి రోజున జరిగే నాలుగు కాలాల్లో అభిషేకానికి పంచకవ్యం, పంచామృతం, తేనె, చెరకు రసంతో శివునికి అర్పించాలి. చందనం, పచ్చకర్పూరం, కస్తూరితో శివలింగానికి అర్చించాలి. ఎరుపు రంగు వస్తువులు తొలికాలంలోనూ, పసుపు రంగు దుస్తులు రెండో కాలంలోనూ, తెలుపు రంగు వస్తువులు మూడో కాలంలో, పచ్చరంగు దుస్తులు నాలుగో కాలంలో శివునికి సమర్పించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ పూజా సమయాల్లో శివపురాణం, లింగాష్టకం పఠించాలి. ఆలయాల్లో నెయ్యి, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. తామర, బిల్వతో పాటు అన్నీ రకాల పువ్వులను స్వామికి సమర్పించుకోవచ్చు. పండ్లు పనస, దానిమ్మ, అరటితో పాటు అన్నీ పండ్లను మహాదేవునికి సమర్పించి.. ఆయన అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments