Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి: జాగరణ చేస్తూ.. నాలుగు జాముల్లో అభిషేకం చేస్తే?

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2014 (18:16 IST)
FILE
త్రిమూర్తులతో లయకారుడైన పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపునిగా ఆవిర్భవించిన పరమపవిత్రమైన రోజు "మహాశివరాత్రి". ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, శిరస్నానం చేసి శివపూజలు, అభిషేకాలు చేయించాలి. పగలంతా ఉపవాసం ఉండాలి.

రాత్రి జాగరణ చేస్తూ నాలుగు జాముల్లో అభిషేకం చేయవలెను. శివుడిని మొదటి జాములో పాలతో, అభిషేకం చేసి పద్మాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

రెండో జాములో పెరుగుతో అభిషేకించి, తులసీదళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగాను, మూడో జాములో నెయ్యి తీసుకుని స్వామికి అభిషేకించి మారేడు దళాలతో పూజించి, నువ్వులతో వండిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించవలెను.

ఇక నాలుగో జాములో తేనెతో అభిషేకం చేసి, పువ్వులతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లింగోద్భవ సయమంలో పూజలు చేయవలెను.

మరునాడు తిరిగి శివపూజలు చేసి శక్తి మేరకు నైవేద్యం సమర్పించి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. ఈ దినం కూడా సూర్యాస్తమయం వరకు నిద్రించకూడదు. ఇలా నియమాలతో శివార్చన చేయడం సకల శుభప్రదం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

Show comments