Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం

Webdunia
గురువారం, 23 మే 2019 (15:28 IST)
కాంగ్రెస్ తురుపుముక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణాలోని మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన రాజశేఖర్‌పై 6270 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. 
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే భువనగిరి, నల్గొండ స్థానాలను కైవసం చేసుకుంది. ఇపుడు రేవంత్ రెడ్డి కూడా విజయం సాధించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు స్థానాల్లో గెలుపొందినట్టయింది. 
 
నిజానికి గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి .. అటు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కో రౌండ్‌లో ఒకరు ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. దాంతో ఎవరిని విజయం వరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విజయం వరించడంతో, ఆయన అభిమాన గణం ఊపిరి పీల్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments