Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం

Webdunia
గురువారం, 23 మే 2019 (15:28 IST)
కాంగ్రెస్ తురుపుముక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణాలోని మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన రాజశేఖర్‌పై 6270 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. 
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే భువనగిరి, నల్గొండ స్థానాలను కైవసం చేసుకుంది. ఇపుడు రేవంత్ రెడ్డి కూడా విజయం సాధించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు స్థానాల్లో గెలుపొందినట్టయింది. 
 
నిజానికి గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి .. అటు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కో రౌండ్‌లో ఒకరు ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. దాంతో ఎవరిని విజయం వరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విజయం వరించడంతో, ఆయన అభిమాన గణం ఊపిరి పీల్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments