Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలకు 547 నామినేషన్లు!!

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (19:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు 547 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు వుంది. తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా, 25వ తేదీతో ముగిసింది. ఇందులో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతో పాటు డమ్మీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లతో కలుపుకుంటే 547కు చేరింది. 
 
ఒక్క ఖమ్మం లోక్‌సభ స్థానానికి ఏకంగా 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌‍సభ స్థానాలకు 120కి పైగా నామినేషన్లు వచ్చాయి. అయితే, నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం చివరి రోజు కావడంతో దీనికితోడు మంచి రోజు కావడంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. కొందరు అభ్యర్థులు రెండు లోదా మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments