Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలకు 547 నామినేషన్లు!!

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (19:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు 547 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు వుంది. తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా, 25వ తేదీతో ముగిసింది. ఇందులో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతో పాటు డమ్మీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లతో కలుపుకుంటే 547కు చేరింది. 
 
ఒక్క ఖమ్మం లోక్‌సభ స్థానానికి ఏకంగా 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌‍సభ స్థానాలకు 120కి పైగా నామినేషన్లు వచ్చాయి. అయితే, నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం చివరి రోజు కావడంతో దీనికితోడు మంచి రోజు కావడంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. కొందరు అభ్యర్థులు రెండు లోదా మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments