తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలకు 547 నామినేషన్లు!!

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (19:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు 547 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు వుంది. తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా, 25వ తేదీతో ముగిసింది. ఇందులో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతో పాటు డమ్మీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లతో కలుపుకుంటే 547కు చేరింది. 
 
ఒక్క ఖమ్మం లోక్‌సభ స్థానానికి ఏకంగా 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌‍సభ స్థానాలకు 120కి పైగా నామినేషన్లు వచ్చాయి. అయితే, నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం చివరి రోజు కావడంతో దీనికితోడు మంచి రోజు కావడంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. కొందరు అభ్యర్థులు రెండు లోదా మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments