Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ ఆఫీస్ నుండి 300 కూర్చీలు ఎత్తుకెళ్లారు..

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (14:01 IST)
ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్‌లను దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. పార్టీలోని అధిష్టానాలకు విధేయులుగా ఉంటూ ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అలాంటి నాయకులకు చివరి నిమిషంలో టికెట్ రాకపోతే తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. 
 
కానీ ఇది కాస్త భిన్నంగా జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలోని సిల్లాడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ ఔరంగాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అగ్ర నాయకత్వాన్ని కోరారు. కానీ ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిరాకరించింది. సత్తార్‌ స్థానంలో ఎమ్మెల్సీ సుభాష్‌ జాంబాద్‌కు ఔరంగాబాద్‌ ఎంపీ టికెట్‌ను కేటాయించారు. దీంతో నిరాశ చెందిన సత్తార్ తన అనుచరులతో పాటు పార్టీ ఆఫీస్‌లో ఉన్న 300 కుర్చీలను తన ఇంటికి తీసుకెళ్లాడు.
 
ఈ సందర్భంగా సత్తార్ మీడియాతో మాట్లాడుతూ..పార్టీ ఆఫీసులో ఉన్న కుర్చీలు తన సొంత డబ్బులతో కొనుగోలు చేసానని, ఈ కుర్చీలను కాంగ్రెస్ సమావేశాల కోసం ఉపయోగించారని, తాను ఇప్పుడు పార్టీ నుండి వైదొలుగుతున్నానని, కనుక తన కుర్చీలను తీసుకెళ్తున్నాని చెప్పాడు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో వాళ్లు కుర్చీలను, ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని సత్తార్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments