Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య గురించి పట్టించుకోని వ్యక్తి.. గుంజీలు తీయాలి.. మోదీకి దీదీ సవాల్

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (16:26 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రచారం పేరుతో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ప్రధానికి ప్రజాస్వామ్యం చెంపదెబ్బేంటో రుచి చూపిస్తామని దీదీ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై  ప్రధాని స్పందించారు. మమతా బెనర్జీని తాను సోదరిలా భావిస్తానని చెప్పుకొచ్చారు. దీదీ కొట్టే చెంపదెబ్బ తనకు దీవెనగా మారుతుందని మోదీ కామెంట్స్ చేశారు. తనను చెంపదెబ్బ కొట్టిన ఫర్వాలేదని, అంతకంటే ముందు పేదలను మోసం చేసిన చిట్‌ఫండ్ కంపెనీలపై చర్యలు తీసుకుంటే బాగుండేదని హితవు పలికారు. 
 
ఇక, మోదీ టార్గెట్‌గా దీదీ మరోసారి చెలరేగిపోయారు. బొగ్గు మాఫియాలో టీఎంసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే రుజువు చేయాలని మోదీకి సవాల్ విసిరారు. రుజువు చేయలేక పోతే, చెవి పట్టుకొని వంద గుంజీలు తీయాలని సవాల్ చేశారు. భార్య గురించి పట్టించుకోని వ్యక్తికి ప్రజల సంక్షేమం గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments