Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య గురించి పట్టించుకోని వ్యక్తి.. గుంజీలు తీయాలి.. మోదీకి దీదీ సవాల్

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (16:26 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రచారం పేరుతో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ప్రధానికి ప్రజాస్వామ్యం చెంపదెబ్బేంటో రుచి చూపిస్తామని దీదీ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై  ప్రధాని స్పందించారు. మమతా బెనర్జీని తాను సోదరిలా భావిస్తానని చెప్పుకొచ్చారు. దీదీ కొట్టే చెంపదెబ్బ తనకు దీవెనగా మారుతుందని మోదీ కామెంట్స్ చేశారు. తనను చెంపదెబ్బ కొట్టిన ఫర్వాలేదని, అంతకంటే ముందు పేదలను మోసం చేసిన చిట్‌ఫండ్ కంపెనీలపై చర్యలు తీసుకుంటే బాగుండేదని హితవు పలికారు. 
 
ఇక, మోదీ టార్గెట్‌గా దీదీ మరోసారి చెలరేగిపోయారు. బొగ్గు మాఫియాలో టీఎంసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే రుజువు చేయాలని మోదీకి సవాల్ విసిరారు. రుజువు చేయలేక పోతే, చెవి పట్టుకొని వంద గుంజీలు తీయాలని సవాల్ చేశారు. భార్య గురించి పట్టించుకోని వ్యక్తికి ప్రజల సంక్షేమం గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments