Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో జోష్... 21న ఎన్డీయే భాగస్వామ్య పార్టీల భేటీ

Webdunia
సోమవారం, 20 మే 2019 (10:02 IST)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భారతీయ జనతా పార్టీలో జోష్ పెంచాయి. దీంతో భాగస్వామ్య పార్టీలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 21వ తేదీన హస్తినలో భేటీకావాలని నిర్ణయించారు. 
 
ఆదివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ మరోమారు అధికారంలోకి రాబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో ఘోషించాయి. దీంతో కమలనాథులు ఉప్పొంగిపోతున్నారు. ఎన్డీయే కూటమిలో జోష్ పెరిగింది.
 
ఎగ్జిట్ పోల్స్ పూర్తి అనుకూలంగా ఉండడంతో ఫలితాల వెల్లడికి ముందే సమావేశం కావాలని ఎన్డీయే పక్షాలు సమావేశం కావాలని నిర్ణయించాయి. ఈ నెల 21న నిర్వహించనున్న ఈ భేటీకి బీజేపీ, దాని మిత్ర పక్షాలు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి.
 
మరోవైపు, ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈ కూటమికి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనధికార కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. భేటీ మాత్రం యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సారథ్యంలోనే చంద్రబాబు ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments