స్మృతి ఇరానీకి షాకిచ్చిన మధ్యప్రదేశ్ ఓటర్లు

Webdunia
గురువారం, 9 మే 2019 (15:38 IST)
కేంద్ర మంత్రి, బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీకి మధ్యప్రదేశ్ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ఈ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉండేది. 
 
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందా? అని ప్రజలను ప్రశ్నించింది. తమకు రుణమాఫీ అయిందని ప్రజలు ముక్త కంఠంతో చెప్పడంతో స్మృతి ఇరానీ ఖంగుతిన్నారు. 
 
మాఫీ అయింది… అయింది అంటూ ప్రజలు గట్టిగా చెప్పడంతో స్మృతి ఇరానీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ఈ ఘటన బుధవారం అశోక్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ పాల్గొన్న సమయంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ట్విటర్‌లో పోస్టు చేశారు. బీజేపీ నేతల అబద్ధపు ప్రచారానికి ప్రజలే నేరుగా సమాధానం చెబుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments