Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతి ఇరానీకి షాకిచ్చిన మధ్యప్రదేశ్ ఓటర్లు

Webdunia
గురువారం, 9 మే 2019 (15:38 IST)
కేంద్ర మంత్రి, బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీకి మధ్యప్రదేశ్ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ఈ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉండేది. 
 
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందా? అని ప్రజలను ప్రశ్నించింది. తమకు రుణమాఫీ అయిందని ప్రజలు ముక్త కంఠంతో చెప్పడంతో స్మృతి ఇరానీ ఖంగుతిన్నారు. 
 
మాఫీ అయింది… అయింది అంటూ ప్రజలు గట్టిగా చెప్పడంతో స్మృతి ఇరానీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ఈ ఘటన బుధవారం అశోక్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ పాల్గొన్న సమయంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ట్విటర్‌లో పోస్టు చేశారు. బీజేపీ నేతల అబద్ధపు ప్రచారానికి ప్రజలే నేరుగా సమాధానం చెబుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments