తనదు మనసు చేత దర్శించి జ్యోతిష మెంత చేసే ననుచు నెంచి చూచు, తన యదృష్టమంత దైవ మెఱుంగడా..? విశ్వదాభిరామ వినుర వేమా..!
తాత్పర్యం : తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు మూర్ఖుడు జ్యోతిష్యమని, వాస్తు అని వ్యర్థమైన వ్యాఖ్యలు చేసి ఆత్మవంచన చేసుకుంటాడు. తన విధి రాతనుబట్టి అలా జరిగిందని భావించడు. తన కర్మల ఫలితమే అలా జరిగిందని, అది దేవుడే అలా చేశాడని గ్రహించలేడని ఈ పద్యం యొక్క భావం.