తాత్పర్యం : తిండి లేక ఒకడు చచ్చిపోతే... తిండి ఎక్కువై మరొకడు చచ్చిపోయాడని సామెత. కాల వ్యవధిని ఇవ్వకుండా, పరిమితి లేకుండా అస్తమానం తినేవాడికి జీర్ణకోశాధి వ్యాధులతో ఆరోగ్యం దెబ్బతిని చావుకు దారి తీయవచ్చు. అన్నం లేనివాడు పోషణ లేక బాధపడతాడు. చంపటానికైనా, కృంగదీయటానికైనా తిండే కారణమని ఈ పద్యం చెప్పాడు వేమన మహాకవి.