Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులు అదే పనిగా చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నారా?

బంటీ నీ సోపు స్లోనా.. అంటూ పలు రకాల యాడ్స్.. చేతిని శుభ్రం చేసుకునేందుకు వచ్చేస్తున్నాయి. అయితే పిల్లలు అదే పనిగా చేతిని సోప్‌లు, లిక్విడ్స్ ద్వారా శుభ్రం చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు.. వైద్యులు.

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (11:37 IST)
బంటీ నీ సోపు స్లోనా.. అంటూ పలు రకాల యాడ్స్.. చేతిని శుభ్రం చేసుకునేందుకు వచ్చేస్తున్నాయి. అయితే పిల్లలు అదే పనిగా చేతిని సోప్‌లు, లిక్విడ్స్ ద్వారా శుభ్రం చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు.. వైద్యులు. అతిశుభ్రంతో చిన్నారులు అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని  చెప్తున్నారు. పెద్దవారి శరీరంలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు సహజీవనం చేస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని సూక్ష్మజీవులు శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇలాంటి సూక్ష్మజీవులు చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి కడుపులో పెరుగుతాయి. 
 
కానీ సూక్ష్మజీవులు పిల్లల శరీరంలో ప్రవేశించేందుకు వీలులేకుండా వారిచేతులను పదే పదే శుభ్రం చేస్తూంటే మంచి సూక్ష్మజీవులు.. పిల్లల శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. దీని కారణంగా వారు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. అందువలన పిల్లలను కొద్దిసేపు మట్టిలో ఆడుకోనివ్వాలని వారు సూచిస్తున్నారు. పిల్లలు ఆటల నుంచి వచ్చిన తరువాత తల్లులు పదే పదే వారి చేతులను సబ్బుతోనూ, లిక్విడ్‌తోనూ శుభ్రం చేస్తారు.
 
ఇలా చేయడం వలన మట్టి నుంచి లభించే మంచి సూక్ష్మజీవులను కూడా మనం పోగొట్టుకోవలసి వస్తుందని, పిల్లలు ఆడుకుని రాగానే వారి చేతులను నీటితో శుభ్రం చేస్తే సరిపోతుందని చైల్డ్ కేర్ నిపుణులు చెప్తున్నారు. ఆల్కహాల్‌తో కూడిన హ్యాండ్ శానిటైజర్లను వాడటం ద్వారా పిల్లల చేతులు పొడిబారుతాయని తద్వారా పగుళ్లు ఏర్పడి.. వాటి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తాయని.. ఇలాంటి శానిటైజర్లు వాడితే మాయిశ్ఛరైజర్ క్రీములు తప్పకుండా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులకు రసాయనాలతో కూడిన హ్యాండ్ వాష్‌లను ఉపయోగించి వాష్ చేయడం కంటే.. చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుందని వారు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

తర్వాతి కథనం
Show comments