పిల్లలకు స్మార్ట్ ఫోన్ అలవాటు చేస్తున్నారా?కళ్లల్లోని తడి ఆరిపోతే అంతే?

స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణమైనా ఉండలేకపోతున్నారు.. చాలామంది. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్ విడుదల చేసే రేడియేషన్‌‌తో మెదడు పనితీరు మందగిస్తు

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (14:07 IST)
స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణమైనా ఉండలేకపోతున్నారు.. చాలామంది. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్ విడుదల చేసే రేడియేషన్‌‌తో మెదడు పనితీరు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే పెద్దల్లోనే కాకుండా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్ లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పిల్లలు, యువత స్మార్ట్ ఫోన్లను అత్యధికంగా వాడటం ద్వారా వారిలో కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
కంటితో తదేకంగా స్మార్ట్ ఫోన్లను చూడటం ద్వారా కళ్లల్లోని తడి ఆరిపోతుందని తద్వారా కళ్ల మంటలు, అలసట, మెడనొప్పి తప్పట్లేదు. ఇవి కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌‌కు కారకాలవుతున్నాయి. ట్యాబ్‌, కంప్యూటర్లను ఎక్కువగా వినియోగించే వారిలోనే ఈ సమస్యలు వస్తున్నాయి. దీనినే సింపుల్‌గా కళ్లు పొడిబారడం (డ్రై ఐస్‌) అని కూడా పిలుస్తారు.

కంటిపాపను ఆడించే సహజ ప్రక్రియ ద్వారా తేమ ఉత్పత్తి అవుతుంది. కానీ రెప్ప వాల్చకుండా తదేకంగా చూస్తే మాత్రం తేమ తగ్గి కళ్లు పొడిబారి పలు రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే చిన్నపిల్లలను స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. 
 
యువత అవసరానికి మించి స్మార్ట్‌ఫోన్ల వినియోగం తగ్గించాలి. ఎక్కువసార్లు కంటి రెప్పలను ఆర్పుతుండాలి. కంప్యూటర్‌పై ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు కనీసం గంటకోసారి ఐదు నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకోవాలి. మంచి నీటిని ఎక్కువగా తాగుతుండాలి. దీనివల్ల కొంతైనా నీటిశాతం పెరిగే అవకాశముంది. కంప్యూటర్‌, ఫోన్లను ఎక్కువ సమయం ఉపయోగించాల్సి వస్తే..స్క్రీన్ లైటింగ్‌ తగ్గించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments